గీతక్క మంత్రి వర్గంలో లేకపోవడం ఒక లోటు !

Telugu Lo Computer
0


టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి (గీతక్క) మంత్రివర్గంలో లేకపోవడం ఒక లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జె.ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు . ఈశ్వరీబాయి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. రవీద్రభారతి ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ఆ రోజుల్లోనే అంబేద్కర్ స్ఫూర్తిగా రాజకీయాల్లో ఈశ్వరీబాయి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. రాజకీయాల్లో రాణిస్తునే గీతారెడ్డిని డాక్టర్ చదివించారని తెలిపారు. ప్రతీ పురుషుడి విజయం వెనకాల ఒక మహిళ ఉన్నట్లు.. గీతక్క ప్రతీ విజయంలో డాక్టర్ సహకారం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడం తాను బాధ్యతగా భావించానని అన్నారు.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గీతారెడ్డి క్రియాశీలకంగా పనిచేస్తున్నారని అన్నారు. ఆరోగ్య సమస్యలను పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పనిచేశారని ..అందుకే గీతక్క ఇన్‌చార్జిగా ఉన్న నల్లగొండ జిల్లాలో అత్యధిక అసెంబ్లీ సీట్లు గెలిచామని తెలిపారు. మంచికి, చెడుకు ఎప్పటికీ తమకు అండగా ఉన్నారని వివరించారు. ఏ అవకాశం ఉన్నా వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)