హిమాచల్‌ ప్రదేశ్‌లో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

Telugu Lo Computer
0


హిమాచల్‌ ప్రదేశ్‌లో ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ భవనం సమీపంలోని రహదారి పాక్షికంగా దెబ్బతిన్నది. సమీపంలోని మరో బిల్డింగ్‌ కూడా పగుళ్లిచ్చింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సిమ్లా సమీపంలోని ఘండాల్ గ్రామంలో జాతీయ రహదారి 205 పక్కన ఉన్న ఐదు అంతస్తుల భవనం శనివారం కుప్పకూలింది. భవనం కూలిపోవడంతో ప్రభుత్వ కాలేజీకి వెళ్లే రోడ్డు ధ్వంసమైంది. ఈ సంఘటన వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా, ధామిలో తవ్వకం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్డింగ్‌ పక్కనే ఉన్న రహదారిలో పగుళ్లు ఏర్పడ్డాయి. అలాగే ధామిలోని డిగ్రీ కళాశాల సమీపంలోని బిల్డింగ్‌ కూడా పగుళ్లిచ్చింది. దీంతో అందులో ఉంటున్న లా కాలేజీ విద్యార్థులను వారం రోజుల కిందట ఖాళీ చేయించారు. ఆ భవనానికి విద్యుత్‌ కనెక్షన్లు కూడా తొలగించారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆ బిల్డింగ్‌ కూలిపోయింది. ముందస్తు చర్యల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)