ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 పోస్టుల దరఖాస్తుల గడువు 17 వరకు పొడిగింపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 7న నోటిఫికేషన్‌ ఇచ్చిన ఏపీపీఎస్సీ దరఖాస్తుల గడువును మరో వారం రోజల పాటు పొడిగించింది. వాస్తవానికి బుధవారంతో దరఖాస్తు గడువు ముగిసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్టు సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌ తెలిపారు. ప్రిలిమ్స్‌ నిర్వహణ తేదీలో మార్పు లేదని, ఫిబ్రవరి 25నే పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ https://psc.ap.gov.inలో చూడవచ్చని పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)