ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం !

Telugu Lo Computer
0

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్​ స్పందించారు. రెండుసార్లు బీఆర్​ఎస్​కు అవకాశమిచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. అలాగే ఫలితాలు నిరాశ కలిగించలేదు, కానీ నిరాశకు గురి చేశాయని చెప్పారు. ఈ ఫలితాలను ఒక పాఠంగా తీసుకొని తిరిగి పుంజుకుంటామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఆయన అభినందనలు చెప్పారు. అలాగే కొంత సమయం తరువాత చేసిన మరో ట్వీట్ లో కాస్తా హాస్యాన్ని జోడించారు. శనివారం సాయంత్రం ఆయన చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ఈసారి మిస్ ఫైర్ అయ్యిందంటూ స్మైలీ ఇమోజీ పెట్టారు. ఫలితాలు తమకు అనుకూలంగానే వస్తాయని చెబుతూ నిన్న సాయంత్రం ఆయన గన్ తో షూట్ చేస్తున్నట్టు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను తాజాగా రీట్వీట్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)