కర్ణాటక లో అమానవీయ ఘటన !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని బెళగావి తాలూకా వంటమూరి గ్రామంలోని బసవేశ్వర్ వీధిలో మహిళను వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి కొట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఓ యువకుడు లవ్ మ్యారేజ్ చేసుకుని ప్రియురాలితో పారిపోవడంతో ఆ యువకుడి తల్లిని శిక్షించారు. యువకుడి తల్లి పట్ల నిందితులు దారుణంగా ప్రవర్తించారని వెలుగు చూసింది. కుమారుడు దుర్గా అతని ప్రియురాలితో కలిసి పారిపోయాడు. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మహిళను నగ్నంగా చేసి చెట్టుకు కట్టేసి చితకబాది ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. మహిళను నగ్నంగా గ్రామం మొత్తం ఊరేగించారు. కుమారుడు దుర్గా అదే గ్రామానికి చెందిన ప్రియాంక అనే యువతిని ప్రేమిస్తున్నాడు. ప్రియాంకకు వేరే అబ్బాయితో కుటుంబ సభ్యులు సోమవారం నిశ్చితార్థం ఫిక్స్ చేశారు. అయితే ఆదివారం రాత్రి దుర్గా అతని ప్రియురాలు ప్రియాంకతో కలిసి పారిపోయాడు. రాత్రి ప్రియాంక అతని ప్రియుడు దర్గకు ఫోన్ చేసి ఊరి బయటకు రావాలని చెప్పిందని, తరువాత ఇద్దరు బెళగావి మీదుగా మహారాష్ట్ర పారిపోయారని తెలిసింది. సోమవారం వేకువ జామున ప్రియాంక ఇంట్లో లేదని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఆగ్రహించిన ప్రియాంక కుటుంబ సభ్యులు దుర్గా ఇంటికి వెళ్లి అతని తల్లిని ఇంటి నుంచి బయటకు లాగి ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు.  ఈ కేసులో ప్రియాంక కుటుంబ సభ్యులతో పాటు మొత్తం ఏడుగురు మహిళ పట్ల దారుణంగా వ్యవహరించారని బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)