మొబైల్ ఫోన్ల తయారీ ఇండస్ట్రీలో 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి !

Telugu Lo Computer
0


మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ ఐ) పథకం కింద భారత్ 5 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని టెలికాం, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్ కొత్త తయారీ ప్లాంట్ ను మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎల్ ఐ ద్వారా మొబైల్ పరిశ్రమలో ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలను కల్పించాం. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అన్నారు. ప్యాడెక్ట్ ఎలక్ట్రానిక్స్ ఏడాదికి 25 మిలియన్ల ఫోన్లను తయారు చేస్తుందని చెప్పారు. డిక్సన్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన పాడ్జెట్ ఎలక్ట్రానిక్స్ 256 కోట్లతో నోయిడాలో తన కొత్త తయారీ యూనిట్ ను ప్రారంభించింది. గత త్రైమాసికంలో Xiaomi పరికరాల ఉత్పత్తిని ప్రారం భించిందన్నారు. ఈ కంపెనీనీ స్మార్ట్ ఫోన్లు, ఫీచర్ ఫోన్లను తయారీ చేస్తుందన్నారు. కొత్త కంపెనీతో మరో 5వేల ఉద్యోగాలు వస్తాయని, జీడీపీ కూడా పెరుగుతుందన్నారు. భారత్ లో మొబైల్ ఫోన్ల డిజైన్, కాంపోనెంట్ తయారీ అభివృద్ధిని కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. ఎగుమతులే లక్ష్యంగా మొబైల్ ఫోన్ భాగాలను తయారు చేయడంపై దృష్టి పెట్టాలని కంపెనీకి సూచించారు. స్వదేశీ స్మార్ట్ ఫోన్ల తయారీ , ఎగుమతి లక్ష్యంగా 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. యాపిల్ సహా పలు చైనా బ్రాండ్ లపై ఆధారపడకుండా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలను విస్తరించేందుకు మొబైల్ ఫోన్ తయారీదారులను పీఎల్ ఐ పథకం ద్వారా కేంద్రం ప్రోత్సహిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)