దేశంలో కొత్తగా 412 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసుల సంఖ్య 4,170కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. వైరల్ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,337 గా నమోదైంది. కర్ణాటక నుండి 24 గంటల వ్యవధిలో మూడు కొత్త మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,660కి చేరుకుంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,72,153కి చేరింది. రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి.
దేశంలో కొత్తగా 412 కరోనా కేసులు నమోదు !
December 26, 2023
0