తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పోచారం మునిసిపాలిటీ పరిధి లోని అన్నోజిగూడలో బుధవారం రాత్రి దరావత్ కరణ్ హత్య జరిగింది. వివరాల్లోకి వెళ్తే ధరావత్ సుశీల తన కొడుకు కరణ్తో అన్నోజిగూడలో 15 ఏళ్లుగా నివసిస్తోంది. ఆమె కూలిపనులు చేస్తూ జీవిస్తోంది. కరణ్ తమ ఇంటికి దగ్గర్లోనే ఉంటున్న 15 ఏళ్ల బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. బుధవారం రాత్రి బాలిక తన ఇంట్లో ఒంటరిగా ఉంది అని తెలుసుకుని వెళ్లాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో బాలిక కుటుంబ సభ్యుల ఇంటి బయట తాళం వేశారు. తర్వాత తాళం తీసి కరణ్పై దాడి చేశారు. దాదాపు మూడు గంటల పాటు చిత్రహింసలు పెట్టారు. కర్రలు, బెల్టుతో కొట్టారు. మర్మాంగాలపై కారం చల్లారు. ఇంకోసారి ఆ బాలిక జోలికి వస్తే, చంపేస్తామని హెచ్చరించి, వదిలేశారు. అప్పటికే నీరసించిపోయిన కరణ్ తన ఇంటికి వెళ్లి పడిపోయాడు. అది గమనించిన తల్లి సుశీల.. అతన్ని ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్ తెలిపారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమ పేరుతో యువకుడి హత్య !
November 10, 2023
0
Tags