ఆర్థిక నేరస్థులకు బేడీలు వేయొద్దు !

Telugu Lo Computer
0


ర్థిక నేరాలకు పాల్పడి కస్టడీకి తీసుకున్న వారి చేతికి బేడీలు వేయవద్దని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్​ఎస్​ఎస్​) ప్రకారం ఒక ఆర్థిక నేరగాడిని అరెస్టు చేసిన మొదటి 15 రోజులకు మించి పోలీసు కస్టడీలో ఉంచినప్పుడు సంబంధించిన మార్పులను సూచించింది. 'ఆర్థిక నేరాలు' అనే పదాన్ని తొలగించడానికి క్లాజ్ 43(3)ని సవరించవచ్చని ప్యానెల్ తెలిపింది. ఆ క్లాజ్ ప్రకారం.. పోలీసు అధికారి నేర స్థాయినిబట్టి కస్టడీ నుంచి మాటిమాటికి తప్పించుకుంటున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో చేతికి సంకెళ్ళు ఉపయోగించవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)