రాజస్తాన్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా బహిరంగ ప్రచార ర్యాలీలో కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం జరిగిన ఈ బహిరంగ ర్యాలీ అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం భారతదేశాన్ని పట్టి పీడుస్తున్న రాహు-కేతువులని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో భారతదేశానికి తలెత్తే కష్టాలన్నింటికీ గాంధీ కుటుంబం, కాంగ్రెస్ల వల్లనే వస్తుందని విమర్శలు గుప్పించారు. భారత ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మోడీ తాను చెప్పినట్లుగానే చంద్రయాన్తో భారత త్రివర్ణ పతాకాన్ని చంద్రునిపై రెపరెపలాడేలా చేశారు. అంతేగాక జీ 20 ఆతిథ్యంతో భారత దౌత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా చేశారు. అలాగే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక 2014లో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రధాన మోడీ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చారు. తమ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రూ. 6 వేలుగా ఉన్నదాన్ని కాస్తా రూ. 12 వేలు చేయాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మిల్లెట్ను ఎంఎస్పీకి కొనుగోలు చేస్తోంది. ఇక గ్యాస్ సిలిండర్లను తమ పార్టీ కేవలం రూ. 450/- లకే అందిచింది. ఇలా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నుంచి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం దేశానికి రాహు-కేతువులు !
November 22, 2023
0
Tags