నా నియోజకవర్గ ప్రజల కోసం నా కొడుకు పనిచేస్తున్నారు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 18 November 2023

నా నియోజకవర్గ ప్రజల కోసం నా కొడుకు పనిచేస్తున్నారు !


'ముఖ్యమంత్రిగా బిజీగా గడుపుతున్నందున నా నియోజకవర్గ ప్రజల కోసం నా కొడుకు పనిచేస్తున్నారు' అని సీఎం సిద్దరామయ్య వెల్లడించారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్‌ నేత కుమారస్వామి తన కొడుకు య తీంద్ర పట్ల అబద్ధాలు ప్రచారం చేశారని తెలిపారు. తన కుమారుడు తన కోసం నియోజకవర్గాన్నే విడిచి పెట్టారన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక వరుణ నియోజకవర్గంలో ప్రజలకు నిరంతరంగా అందుబాటులో ఉండడం సాధ్యం కావడం లేదని వివరించారు. ప్రజల కోసం యతీంద్ర పనిచేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేడీపీ సభ్యుడిగా కొ నసాగుతున్నందున కొన్ని అంశాలు తనతో చర్చించారని అన్నారు. వాటికి పెడార్థాలు కల్పించి కుమారస్వా మి ప్రచారం చేశారన్నారు. ఆయనకు కడుపుమంట అని, ద్వేషంతోనే ఇలా అబద్ధాలు మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. తమకు రాజకీయాల్లో ద్వేషం తెలియదని, ఎవరైనా తప్పు చేస్తే అంగీకరించేదిలేదన్నారు. ఎప్పటికీ ద్వేషపూరిత రాజకీయాలు చేసేది లేదన్నారు. కుమారస్వామి ఎప్పుడైనా సత్యం మాట్లాడి ఉంటే చెప్పాలని ప్రశ్నించారు. హిట్‌ అండ్‌ రన్‌ ఆయన విధానమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తానంటే భయమని, అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలోనూ తమ గ్యారెంటీల పట్ల విమర్శలు గుప్పిస్తున్నారని తెలిపారు. బీజేపీ నేత సోమణ్ణ, జేడీఎస్‌ నేత జీటీ దేవెగౌడ కాంగ్రె్‌సలోకి వస్తే స్వాగతిస్తామని, అయితే వారి చేరికకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. 

No comments:

Post a Comment