వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేసి ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 49 వ శతకం కావడం విశేషం. వన్డేల్లో సచిన్ 49 శతకాలు చేయడానికి 452 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. విరాట్ కోహ్లీ కేవలం 277 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను అందుకోవడం విశేషం. విరాట్ కోహ్లీ (భారత్) - 49 శతకాలు (277 ఇన్నింగ్స్లు) సచిన్ టెండూల్కర్ (భారత్) - 49 శతకాలు (452 ఇన్నింగ్స్లు) రోహిత్ శర్మ(భారత్) - 31శతకాలు (251 ఇన్నింగ్స్లు) రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 30 (365 ఇన్నింగ్స్లు) సనత్ జయసూర్య (శ్రీలంక)- 28 శతకాలు (433 ఇన్నింగ్స్లు)
సచిన్ శతకాల రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ !
November 05, 2023
0
Tags