ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ పీఆర్ఎస్ ఒబెరాయ్ మంగళవారం ఉదయం కన్నుమూశారని ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. ఆయన మరణం ఒబెరాయ్ గ్రూపుతోపాటు భారత్, విదేశీ ఆతిథ్య రంగానికి తీవ్రమైన నష్టమని ప్రకటనలో పేర్కొన్నారు. అంత్యక్రియులు మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్నాయని వివరించారు. ఢిల్లీలోని కపషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫామ్లో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు. పీఆర్ఎస్ ఒబెరాయ్ దూరదృష్టి గల నాయకుడని, అంకితభావం, మక్కువతో ఒబెరాయ్ గ్రూప్, హోటళ్లను ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దారని ప్రకటనలో గ్రూపు పేర్కొంది. ఆయన విస్తరించిన హోటళ్లు భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆతిథ్య రంగాన్ని ప్రభావితం చేస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా పీఆర్ఎస్ ఒబెరాయ్ దేశీయ హోటల్ వ్యాపార ముఖచిత్రానికి కొత్తరూపు తీసుకొచ్చి ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు.
పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూత
November 14, 2023
0
Tags