కూతురిని వేధిస్తున్న వ్యక్తిని దారుణంగా చంపిన తండ్రి !

Telugu Lo Computer
0


బెంగళూరులోని ఆనేపాల్యలో నివసిస్తున్న మంజునాథ్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడికి ముగ్గురు పిల్లలు. అతని రెండో కుమార్తె తో డేవిడ్ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. అతన్ని గత కొద్ది రోజులుగా ఫాలో అవుతూ వచ్చాడు. ఇటీవల మంజునాథ్ వీరి మధ్య ఉన్న బంధాన్ని గుర్తించి  హెచ్చరించాడు. తన కూతురితో సంబంధం కొనసాగించవద్దని సలహా కూడా ఇచ్చాడు. అయినప్పటికీ, డేవిడ్ ఆమెకు ఫోన్‌లో కాల్ చేస్తూనే ఉన్నాడు. తనతో శారీరకంగా కలవకుంటే ఇద్దరం కలిసిన ఫోటోలను ఫ్రెండ్స్ కు, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని వెంటనే తన తండ్రికి చెప్పింది. అతని తీరు మారలేదని మళ్లి రమ్మని బెదిరిస్తున్నట్లు ఆదివారం తన తండ్రికి చెప్పింది. అతనికి మరోసారి వార్నింగ్ ఇచ్చాడు మంజునాథ్. కానీ వినలేదు. దాంతో సుబ్బన్న గార్డెన్‌ సమీపంలో డేవిడ్‌ను కలవాలని మంజునాథ్‌ కోరాడు. కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తరువాత మంజునాథ్ డేవిడ్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్త స్రావం కావడం తో డేవిడ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి మంజునాథ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)