వివిన్ రిచర్డ్స్ తో వెంకటేష్ సెల్ఫీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 16 November 2023

వివిన్ రిచర్డ్స్ తో వెంకటేష్ సెల్ఫీ !

ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో విక్టరీ వెంకటేష్ సందడి చేశాడు. ఈ క్రమంలోనే తన ఫేవరెట్ క్రికెటర్స్ లో ఒకరైన వెస్టిండీస్ లెజెండరీ మాజీ క్రికెటర్ వివిన్ రిచర్డ్స్ తో కలిసి సెల్ఫీ దిగాడు. “ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో దిగ్గజ క్రికెటర్ వివిన్ రిచర్డ్స్ తో కలిసి ఉండడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ ట్వీట్ చేశాడు వెంకటేష్. వెంకీ మామ సెల్ఫీ పిక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.ఈ సెల్ఫీ పిక్ చూసిన నెటిజన్స్. ''ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లెజెండ్స్'' అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక దగ్గుబాటి ఫ్యాన్స్ అయితే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీగా లైకుల వర్షం కురిపిస్తున్నారు. ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరవ్వడం విశేషం. ఈ సెమీ ఫైనల్ వీక్షించేందుకు కొందరు సెలెబ్రెటీలకు గోల్డెన్ పాస్ లు కూడా జారీ చేశారు. ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న వారిలో రజినీకాంత్ కూడా ఒకరు.అలాగే ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ ని వీక్షించేందుకు చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ వచ్చారు. రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహం తదితరులు సందడి చేశారు. ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే .ఆయన నటిస్తున్న ‘సైంధవ్’మూవీ విడుదలకు సిద్ధంగా వుంది. 

No comments:

Post a Comment