ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ సీఈవో భారత్ గెలవాలని కోరుకుంటూ తమ వినియోగదారులకు ఓ బంపరాఫర్ ప్రకటించారు. ఫైనల్లో భారత్ విజయం సాధిస్తే రూ.100కోట్లు పంచుతానని 'ఆస్ట్రోటాక్' సీఈవో పునీత్ గుప్తా తన సోషల్మీడియా ఖాతాలో ప్రకటించారు. ''2011లో భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు కాలేజీలో చదువుకుంటున్నా. ఆ రోజు ఫ్రెండ్స్తో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్ చూశా. మ్యాచ్ జరుగుతున్నంత సేపు మాకు టెన్షనే. ఆ టోర్నీలో టీమ్ఇండియా గెలిచాక నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడు టీమ్ఇండియా మళ్లీ ఫైనల్కు వచ్చింది. ఈసారి భారత్ గెలిస్తే ఏం చేయాలా? అని చాలాసేపు ఆలోచించా. అప్పుడు నా ఆనందాన్ని పంచుకోవడానికి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మా ఆస్ట్రోటాక్ వినియోగదారులంతా నా మిత్రులే. వారితో కలిసి నా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నా. భారత్ ప్రపంచకప్ను ముద్దాడితే మా సంస్థ యూజర్లందరికీ రూ.100 కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నా'' అని పునీత్ గుప్తా తన పోస్ట్లో వెల్లడించారు.
ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా వినియోగదారులకు బంపరాఫర్ !
November 19, 2023
0
Tags