కర్ణాటకలోని మండ్య నగరం సమీపంలోని ఓ గ్రామంలో జగన్నాథ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన అమల అనే యువతిని పెళ్లి చేసుకోవడానికి జగన్నాథ్ ఓకే చెప్పాడు. అందరి సమక్షంలో జగన్నాథ్, అమలల పెళ్లి జరిగింది. చాలా సంవత్సరాలు జగన్నాథ్, అమల దంపతులు కాపురం చేశారు. అయితే కట్టుకున్న భార్య అమల మీద మోజు తీరిపోయింది అనుకున్న జగన్నాథ్ వివాహిత మహిళ రజనీ అనే వివాహిత మహిళతో జగన్నాథ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య రజనీకి మాయమాటలు చెప్పి బయటకు వెలుతున్న జగన్నాథ్ అతని ప్రియురాలు రజనీతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.విషయం తెలుసుకున్న అమల ఆమె భర్త జగన్నాథ్ కు బుద్దిచెప్పాలని అనుకుంది. తన భార్య అమలకు తన అక్రమ సంబంధం మ్యాటర్ తెలిసిపోయిందని అనుకున్న జగన్నాథ్ అతను జాగ్రత్తపడ్డాడు. అయితే ఇటీవల భర్త జగన్నాథ్, అతని ప్రియురాలు రజనీ ఏకాంతంగా బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఇద్దరిని అమల రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పెద్ద గొడవ చేసింది. జగన్నాథ్, అతని ప్రియురాలు రజనీల గొడవ పంచాయితీ పెద్దల ముందుకు వెళ్లింది. ఎవరు ఎన్ని చెప్పినా జగన్నాథ్ ను వదిలిపెట్టడానికి అతని ప్రియురాలు రజనీ అంగీకరించలేదు. నీ భర్త జగన్నాథ్ తన దగ్గర రూ. 5 లక్షలు అప్పు చేశాడని, నువ్వు ఆ ఐదు లక్షల రూపాయలు తనకు ఇచ్చి నీ మొగుడిని నువ్వు పిలుచుకుని వెళ్లాలని ప్రియురాలు రజనీ పంచాయితీలో ప్రియుడి భార్య అమలకు షరతులు పెట్టింది. ఊరు అంతా అప్పులు చేసి ఎంజాయ్ చేస్తున్న ఇలాంటి భర్త తనకు వద్దని, నువ్వే నాకు రూ 5 లక్షలు ఇచ్చి నాభర్తతో నువ్వు పడక సుఖం పొందాలని, భర్తను వదిలేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అమల చెప్పడంతోం పంచాయితీ పెద్దలు బిత్తరపోయారు. అయితే అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడిని అందరి సమక్షంలో రూ 5 లక్షలకు కొనుక్కోవడానికి రజనీ అంగీకరించింది. అందరి సమక్షంలో భర్త జగన్నాథ్ ను రూ 5 లక్షలకు అమ్మేస్తున్నానని అమల లిఖితపూర్వకంగా లేఖరాసి రజనీకి ఇచ్చింది. ప్రియుడు జగన్నాథ్ భార్య అమలకు నెల రోజుల్లోపు రూ. 5 లక్షలు ఇచ్చి తన ప్రియుడిని కొనుక్కుంటానని రజనీ కూడా లిఖితపూర్వకంగా లేఖ రాసి ఇవ్వడంతో పంచాయితీ పెద్దలు బిత్తరపోయారు.
Post Top Ad
adg
Saturday 21 October 2023
Home
karnataka
ఐదు లక్షల రూపాయలకు
బిత్తరపోయిన పంచాయితీ పెద్దలు
భర్తను అమ్మిన భార్య
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పెద్ద గొడవ చేసింది
లిఖితపూర్వకంగా లేఖ
భర్తను అమ్మిన భార్య !
భర్తను అమ్మిన భార్య !
Tags
# karnataka
# ఐదు లక్షల రూపాయలకు
# బిత్తరపోయిన పంచాయితీ పెద్దలు
# భర్తను అమ్మిన భార్య
# రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పెద్ద గొడవ చేసింది
# లిఖితపూర్వకంగా లేఖ
About Telugu Lo Computer
లిఖితపూర్వకంగా లేఖ
Tags
karnataka,
ఐదు లక్షల రూపాయలకు,
బిత్తరపోయిన పంచాయితీ పెద్దలు,
భర్తను అమ్మిన భార్య,
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పెద్ద గొడవ చేసింది,
లిఖితపూర్వకంగా లేఖ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment