తమిళనాడులోని కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా సింగపూర్ ప్రయాణీకుల నుంచి రూ.80 లక్షల విలువైన 1.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్యాంటులో దాచి తరలించేందుకు ప్రయత్నించిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
October 01, 2023
0
Tags