14 వరకు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు !

Telugu Lo Computer
0


భారత్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్కు అక్టోబర్ 14 వరకు ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు, ఎయిర్ ఇండియా సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు అవసరమైన సపోర్ట్ అందిస్తామని తెలిపింది. ఇజ్రాయిల్ -పాలస్తీనా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేస్తున్నారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5 వేలకు పైగా రాకెట్లతో దాడులు చేశారు. అంతేకాకుండా రోడ్డు మార్గంలో సరిహద్దుల్లో ప్రవేశించి ఆరాచాకాలకు తెగబడ్డారు. హమాస్ ఉగ్రవాదుల దాడికి ప్రతీగా ఇజ్రాయిల్ 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్' ప్రారంభించింది. గాజా తీరప్రాంతంపై వైమానిక దాడి చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)