రవీందర్ చంద్రశేఖరన్ నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు !

Telugu Lo Computer
0


కోలీవుడ్ నటి మహాలక్ష్మీ ఒకప్పుడు ఫేమస్ కాలేదు కానీ, ఎప్పుడైతే నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ వివాహమాడిందో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. అంత బరువు ఉన్న నిర్మాతను ప్రేమించి,ఏరికోరి రెండో పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆమె ప్రేమను శంకించారు. డబ్బుకోసమే నిర్మాతను వివాహమాడిందని చెప్పుకొచ్చారు. ప్రేమతో కాదని, ఆస్తి, నగలు కోసం ప్రేమ పేరుతో రవీందర్ను వలలో వేసుకుందని విమర్శించారు. ఇక ఎవరేం అన్నా పట్టించుకోని ఈ జంట  ఏడాది పాటు తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపారు. ఏడాదిలో రవీందర్ మహాలక్ష్మీ కి కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చి సర్ ప్రైజ్ కూడా చేశాడు. ఈ ఏడాది ఒక చీటింగ్ కేసులో రవీందర్ జైలుకు వెళ్ళాడు. భర్త జైల్లో ఉన్నాడు అన్న బాధలేకుండా మహాలక్ష్మీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మహాలక్ష్మీ భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. రవీందర్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని సన్నహితుల ముందు చెప్పుకొచ్చిందని తెలుస్తోంది. ” పెళ్ళికి ముందు రవీందర్ ఇలాంటి విషయాలు నాకేం చెప్పలేదు. చీటింగ్ కేసులు, డబ్బు విషయాలు మా మధ్య రాలేదు. నాకు అబద్దాలు చెప్పి , మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు” అంటూ తెలిపింది. దీంతో అభిమానులు ఆమె వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. డబ్బు ఉన్నంత కాలం సైలెంట్ గా ఉండి, ఇప్పుడు అతడు జైల్లో ఉంటే మోసం చేశాడు అని చెప్పడం భావ్యం కాదని, ఇలా చేస్తే కచ్చితంగా తాను డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అనుకుంటారని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మహాలక్ష్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)