భాజపాకు చెందిన సీనియర్ నేతలు తమ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ సింగ్ అన్నారు. త్వరలో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీపై విమర్శలు చేశారు. ఈ మేరకు సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ''త్వరలో మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపాను గద్దె దింపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. తమ ఓటమిని ముందే గ్రహించిన భాజపా సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. 18 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా నేతల పాపాల్ని కడిగేయగలనని ప్రధాని నరేంద్ర మోడీ అనుకుంటున్నారా?'' అని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.
భాజపా నేతలు కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నారు !
September 25, 2023
0
Tags