జమ్మూకశ్మీర్‌లోనిఎన్‌కౌంటర్‌

Telugu Lo Computer
0


మ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లా చసానా సమీపంలో సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతంకాగా, ఓ జవాన్ గాయపడ్డాడు. ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. దీని ఆధారంగానే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిపారు. చసానాలోని తులి ప్రాంతంలోని గాలీ సోహబ్‌లో ఎన్‌కౌంటర్ జరుగుతోందని.. పోలీసులు, ఆర్మీ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారని ఏడీజీపీ పేర్కొన్నారు. గాయపడిన పోలీసును చికిత్స నిమిత్తం తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)