ప్రధాని భద్రతా వ్యవహారాలు చూసే ఎస్పీజీ చీఫ్ అరుణ్ కుమార్ సిన్హా మృతి - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 6 September 2023

ప్రధాని భద్రతా వ్యవహారాలు చూసే ఎస్పీజీ చీఫ్ అరుణ్ కుమార్ సిన్హా మృతి


ప్రధాని మోడీ భద్రత బాధ్యతలను నిర్వర్తించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా బుధవారం ఉదయం గురుగ్రామ్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అరుణ్ కుమార్ సిన్హా 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈ మే 31 వ తేదీన ఆయనకు మరో సంవత్సరం పదవీకాల పొడగింపు లభించింది. అస్వస్థతకు లోను కావడంతో కొన్ని రోజుల క్రితం ఆయనను గురుగ్రామ్ లోని ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. ఎస్సీజీ 12 వ డైరెక్టర్ గా ఆయన 2016 మార్చి నెలలో బాధ్యతలు స్వీకరించారు. 2024, మే 31 వరకు ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా, దురదృష్టవశాత్తూ బుధవారం మరణించారు. ఎస్పీజీ చీఫ్ హోదా రాష్ట్ర డీజీపీతో సమానంగా ఉంటుంది.  ఎస్పీజీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టక ముందు తన రాష్ట్ర కేడర్ అయిన కేరళలో, బీఎస్ఎఫ్ లో పలు కీలక బాధ్యతలను ఏకే సిన్హా చేపట్టారు. ఎస్పీజీని 1985 లో ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో సుమారు 30 వేల మంది సుశిక్షిత సిబ్బంది ఉన్నారు.


No comments:

Post a Comment