గుజరాత్లోని జామ్నగర్, పటేల్ పార్క్ పరిసరాల్లో వినిత్ మెహుల్భాయ్ కున్వరియా అనే యువకుడు జానపద నృత్య రూపమైన గర్బా ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు. రాబోయే నవరాత్రి ఉత్సవాల కోసం పటేల్ పార్క్ ప్రాంతంలో ఉన్న గర్బా క్లాస్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. మొదటి రౌండ్ పూర్తి చేసిన తర్వాత అనూహ్యంగా నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి సీరియస్ గా ఉందని అతడిని GG ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కున్వరియా కుటుంబ సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ యువకుడికి ఎటువంటి అంతర్లీన అనారోగ్యం లేదని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు.
గర్బా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కుప్పకూలిన యువకుడు !
September 27, 2023
0
Tags