66 కిలోల బంగారంతో అలంకరణ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 18 September 2023

66 కిలోల బంగారంతో అలంకరణ !


ముంబయిలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్‌ 'మహాగణపతి' ఈ ఏడాదీ వార్తల్లో నిలిచింది. ఇక్కడి విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఏకంగా 66.5 కిలోల బంగారు, 295 కిలోలకు పైగా వెండి ఆభరణాలు, ఇతరత్రా విలువైన వస్తువులతో అలంకరించడం గమనార్హం. పైగా మండపానికి రికార్డు స్థాయిలో రూ.360.40 కోట్లకు బీమా చేయించినట్లు జీఎస్‌బీ సేవామండల్‌ నిర్వాహకులు ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ ఏడాది 69వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలోనే మండపం వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా మొదటిసారి ఫేషియల్‌ రికగ్నిషన్‌ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ ఏడాది రూ.360.40 కోట్లకు బీమా తీసుకున్నట్లు చెప్పారు. భక్తులు, నిర్వాహకులకు ఇది వర్తిస్తుంది. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్‌ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, వచ్చే ఏడాది ప్రారంభోత్సవం పురస్కరించుకుని హోమం, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment