లాకప్‌డెత్‌ల్లో ఉత్తరాదిన గుజరాత్‌, దక్షిణాదిన తమిళనాడు ఫస్ట్ !

Telugu Lo Computer
0


దేశంలో ఉన్న పోలీస్ స్టేషన్లలో మరణాలకు సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ వివరాల మేరకు  2018 నుంచి 2023 మార్చి 31 వరకు నమోదైన వివరాలను పేర్కొంది. జాతీయ స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాల్లో గుజరాత్‌లో 81, మహారాష్ట్రలో 80, మధ్య ప్రదేశ్‌లో 50, బిహార్‌లో 47, ఉత్తరప్రదేశ్‌లో 41, వెస్ట్‌బెంగాల్‌లో 40 మొదటి ఆరు స్థానాల్లో నిలిచాయి. దక్షిణ రాష్ట్రాలలో మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. ఆ రాష్ట్రంలో 2018-19లో 11, 2019-20లో 12, 2020-21లో 2, 2021-22లో 4, 2022-23లో 7.. మొత్తం కలిపి ఇప్పటి వరకు 36 లాకప్ డెత్‌లు నమోదయ్యాయి. మరోవైపు రాబోయే ఐదేళ్లలో తమిళనాడు పోలీస్ స్టేషన్లలో 'లాకప్ డెత్' లేని పరిస్థితి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)