మన్యం సీతాఫలాలకు మంచి గిరాకీ !

Telugu Lo Computer
0


న్యం సీతాఫలాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఎంత ధర అయినా కొనేందుకు కొంతమంది వెనకాడరు. బుధవారం కాశీపట్నం, డముకు గ్రామాల్లో జరిగిన సంతల్లో సీతాఫలాలు అత్యధిక ధరలు పలికాయి. కాశీపట్నం సంతలో ఒక కావిడి (200) పండ్లు రూ.2500 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. పాలకొల్లు, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, సీతానగరం, విశాఖపట్నం, విజయనగరం, ఒడిశా ప్రాంతాలకు వీటిని ఎగుమతి చేస్తుంటారు. ఈ సంతలకు సుమారు వంద గ్రామాల రైతులు వీటిని తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయిస్తుంటారు. అధిక ధరలు పలకడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)