ఇండియన్ వెబ్ బ్రౌజర్ ఛాలెంజ్‌ పోటీ !

Telugu Lo Computer
0


కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(ఎంఈఐటీ) మన సొంత బ్రౌజర్ తయారు చేయడానికి ఓ పోటీ నిర్వహిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్‌లు, ఎల్‌ఎల్‌పీలను ఎంఈఐటీ ఆహ్వానిస్తోంది. వ్యక్తులు కూడా సొంతంగా ఈ పోటీలో పాల్గొనవచ్చు. అయితే ముగ్గురు లేదా ఐదుగురు వ్యక్తులు గ్రూప్‌గా ఏర్పడి ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపింది. ఈ పోటీలో పాల్గొంటే నగదు బహుమతులే కాదు ఇండియాకు సొంత బ్రౌజర్ తయారుచేసి ఇచ్చిన సంస్థ/ వ్యక్తిగా మీ పేరు నిలిచిపోతుందని ప్రకటించింది. ఈ ఛాలెంజ్ మూడు దశల్లో ఉంటుంది. మొత్తం 3.4 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కేటాయించారు.

మొదటి స్టేజ్‌లో ఐడియేషన్‌. మీ ఆలోచన సిద్ధం చేసి చెప్పడానికి 2 నెలల సమయం ఇస్తారు. 18 మందిని ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తారు.

రెండో స్టేజ్‌లో ప్రోటో టైప్ తయారు చేయాలి. దీనికి మూడు నెలల సమయం ఇస్తారు. మొత్తం 8 మందిని లేదా సంస్థలను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందజేస్తారు.

మూడోది, చివరిది.. లాస్ట్ స్టేజ్ డెవలప్‌మెంట్‌. దీనికి 7 నెలల టైమ్ ఇస్తారు. ఇందులో కేవలం మూడు బహుమతులే ఉంటాయి. మొదటి బహుమతి రూ.కోటి, రెండో బహుమతి రూ.75 లక్షలు, మూడో బహుమతి రూ.50 లక్షలు.

Post a Comment

0Comments

Post a Comment (0)