అమర్ నాథ్ యాత్ర ను అధికారులు నేడు నిలిపివేశారు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే శనివారం జమ్మూ బేస్ క్యాంప్ నుంచి అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు. ఆ ప్రాంతం నుంచి యాత్రకు వెళ్లేందుకు ఎవరినీ అనుమతించట్లేదు. అధికారుల చర్యతో వందలాది మంది యాత్రికులు క్యాంపులకే పరిమితమయ్యారు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూ- కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత (జమ్మూ-కశ్మీర్, లడఖ్) ప్రాంతాలుగా ప్రకటించింది.
Post Top Ad
adg
Saturday, 5 August 2023
Home
National
అమర్నాథ్ యాత్ర నేడు నిలిపివేత
ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు
అమర్నాథ్ యాత్ర నేడు నిలిపివేత
అమర్నాథ్ యాత్ర నేడు నిలిపివేత
Tags
# National
# అమర్నాథ్ యాత్ర నేడు నిలిపివేత
# ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా
# జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు
About Telugu Lo Computer
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు
Tags
National,
అమర్నాథ్ యాత్ర నేడు నిలిపివేత,
ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా,
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment