రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు

Telugu Lo Computer
0


తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ విభాగం మంగళవారం సోదాలు నిర్వహించింది.రూ.9,394 కోట్ల రుణ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, గుంటూరు సహా తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఇతర ప్రమోటర్ల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ తెలిపింది. ఇదే కేసులో ట్రాన్స్‌స్ట్రాయ్ పవర్ ప్రాజెక్టులకు చెందిన మలినేని సాంబశివరావుపై కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. రాయపాటి కంపెనీ నుంచి మలినేని సాంబశివరావు కంపెనీకి డబ్బు మళ్లిందని ఈడీ వెల్లడించింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)