బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 72గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు పడనున్నాయి. ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురవనున్నాయి. ఇవాళ వాయువ్య బంగాళాఖాతంలో ఉపరతిల ఆవర్తనం ఏర్పడనుందని, రేపు అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. https://t.me/offerbazaramzon
Post a Comment
0Comments
3/related/default