బీహార్లోని సివాన్ జిల్లాలో గ్యానీమోర్ సమీపంలో విపిన్ (25) ఓ మొబైల్ రిపేర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. విపిన్ తన స్నేహితులతో కలిసి మోమోలు తినే పందెం కాశాడు. ఈ క్రమంలో ఏకంగా 150 వరకు మోమోలు తిని తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే ప్రాణాలు విడిచాడు. గోపాల్గంజ్, సివాన్ జిల్లాల సరిహద్దులోని రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో పడున్న ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడు విపిన్ కుమార్ (25) ను తూర్పు చంపారన్ జిల్లాలోని సిహౌర్వా గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. విపిన్ను అతడి స్నేహితులు కావాలనే విషం పెట్టి చంపారని తండ్రి విష్ణు మాంఝీ ఆరోపిస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. https://t.me/offerbazaramzon
ప్రాణం తీసిన పందెం !
July 16, 2023
0
Tags