తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని మిజోరం ముఖ్యమంత్రి జోరం తంగాను మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ హెచ్చరించారు. మణిపూర్ హింసతో తీవ్రంగా ప్రభావితమైన కుకీ వర్గానికి సంఘీభావంగా మిజోరంలో ర్యాలీ నిర్వహించారు. దీనికి సీఎం జోరం తంగా హాజరయ్యారు. దీనిపై బీరెన్సింగ్ స్పందిస్తూ తాము ఎవరికీ భయపడబోమని, అక్రమ చొరబాటుదారులను రాష్ట్రం నుంచి తరిమేస్తామని స్పష్టం చేశారు. కుకీ తెగకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. డ్రగ్ ముఠాపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన తర్వాతే సమస్య మొదలైందని సీఎం చెప్పారు. https://t.me/offerbazaramzon
మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు !
July 28, 2023
0
Tags