ఐఫోన్ కోసం కొడుకుని అమ్మేశారు !

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పర్గనస్ జిల్లాలోని పనిహాటి గాంధీనగర్ ఏరియాలో జయ్‌దేవ్, సాఠి అనే దంపతులకి ఏడు సంవత్సరాల కూతురితో పాటు 8 నెలల కొడుకు ఉన్నాడు. వీరిది చాలా పేద కుటుంబం. పూటగడవడం కూడా కష్టమే. అలాంటి ఈ దంపతుల చేతిలో సడెన్‌గా ఐఫోన్ దర్శనమిచ్చింది. ఈ ఫోన్‌తో వాళ్లు రీల్స్ షూట్ చేయడం మొదలుపెట్టారు. పక్క రాష్ట్రాలకు కూడా వెళ్లి, అందమైన లొకేషన్స్‌లో రీల్స్ షూట్ చేశారు. అయితే ఐఫోన్ వచ్చినప్పటి నుంచి వీరి 8 నెలల బాబు కనిపించకపోవడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వాళ్లు ఉండలేక ఆ జంటని నిలదీశారు. 'మీ బాబు ఏమయ్యాడు? కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు' అని అడిగారు. అందుకు ఆ జంట.. ''డబ్బుల కోసం మా బాబుని ఒక వ్యక్తికి అమ్మేశాం'' అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఖంగుతిన్న స్థానికులు, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. మొదట తల్లి సాఠిని అరెస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు బాబుని రెస్క్యూ చేశారు. అలాగే.. ఆ బాబుని కొనుగోలు చేసిన ప్రియాంక అనే మహిళని సైతం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చారన్న సంగతి తెలిసి జయ్‌దేవ్ పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ, చివరికి అతడు కూడా దొరికిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. నిజానికి.. కొడుకుని అమ్మిన తర్వాత కూతురిని సైతం అమ్మేయాలని జయదేవ్ ప్లాన్ చేశాడు. ఒక వ్యక్తితో ఒప్పందం కూడా కుదుర్చున్నాడు. ఈలోపే వీరి బండారం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)