27 మంది యువకులను పెళ్ళాడి మోసం చేసిన కిలాడీ !

Telugu Lo Computer
0


మ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో తమ భార్య కనిపించడం లేదంటూ 12 మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులు ఇచ్చిన ఫొటోలు చూసిన పోలీసులు షాకయ్యారు. ఆ 12 మంది భర్తలు ఇచ్చిన ఫొటోలలో ఉన్నది ఒకే మహిళ కావడమే అందుకు కారణం. దీనిపై కాస్త లోతుగా పోలీసులు విచారణ జరపగా,  కాస్త అటూఇటూగా అందరు చెప్పిన స్టోరీ ఒకేలా ఉంది. ఓ యువతి మధ్యవర్తి సాయంతో పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజుల కాపురం చేశాక ఏదో ఒక కారణం చెప్పి కనిపించకుండా పోవడం, పోతూ పోతూ ఇంట్లో ఉండే డబ్బు, నగలతో ఉడాయించడం. ఇలా ఆ కిలేడి ఒకరిద్దరు కాదు ఏకంగా 27 మంది యువకులను పెళ్లి చేసుకుని మోసం చేసింది. అయితే అనుకోకుండా వీరిలో 12 మంది మాత్రమే పోలీస్‌ స్టేషన్‌ వరకు రావడంతో ఈ బండారం మొత్తం బయటపడింది. 27 మందిని పెళ్లి చేసుకొని 20 రోజులు వారితో ఉండి, డబ్బు, బంగారంతో పారిపోయిందని సమాచారం. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఫొటో ఆధారంగా మాయలేడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)