వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియాకి మంచి ఆరంభం లభించింది. తొలుత విండీస్ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ బ్యాటింగ్లోనూ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (30), యశస్వి జైస్వాల్ (40) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 70 పరుగుల వెనుకంజలో ఉంది. విండీస్ ప్లేయర్లలో అరంగేట్ర ఆటగాడు అథనేజ్ (47) మినహా మిగతావారు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. బ్రాత్ వైట్ (20), జేసన్ హోల్డర్ (18), బ్లాక్ వుడ్ (14), త్యాగ్నారాయణ్ చందర్ పాల్ (12), రఖీమ్ కార్నివాల్ (19*) పరుగులు చేశారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. జడేజా 3, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. https://t.me/offerbazaramzon
తొలి టెస్టులో విండీస్ 150 పరుగులకే ఆలౌట్
July 13, 2023
0
Tags