ముంబయిలో నిర్మాణంలో ఉన్న టవర్ 13వ అంతస్తులో ఓ కొండ చిలువ ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో.. అంత పై వరకూ ఎలా వెళ్లిందో తెలియని స్ధానికులు షాకయ్యారు. ముంబయిలోని ఘాట్ కోపర్లో పన్నెండు అంతస్టుల టవర్ గ్రిల్డ్ టెర్రస్ పైకి ఎక్కింది. దాదాపుగా నాలుగు అడుగుల పొడవున్న ఈ కొండచిలువను చూసి జనం షాకయ్యారు. ఈ కొండచిలువను పట్టుకుని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ భోయిర్కు అప్పగించారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.. అసలు అంత ఎత్తు వరకూ ఎలా వెళ్లిందో తెలియక ఆందోళన చెందారు. టవర్లో నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో అక్కడ ఉన్న సిమెంట్ పేస్ట్లో చిక్కుకుంది. మొత్తానికి దానిని రెస్క్యూ చేసి అక్కడి నుంచి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. https://t.me/offerbazaramzon
నిర్మాణంలో ఉన్న టవర్ 13వ అంతస్తులో కొండచిలువ ప్రత్యక్షం !
July 27, 2023
0
Tags