ఒడిశాలో నువాపాడా జిల్లాలోని దుర్గ్-పూరి ఎక్స్ప్రెస్ ఎయిర్ కండిషన్డ్ కోచ్లో మంటలు చెలరేగాయి. ఇది ప్రయాణీకులను భయాందోళనలకు గురిచేసిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారిక ప్రకటనలో తెలిపింది. 'గురువారం సాయంత్రం రైలు ఖరియార్ రోడ్ స్టేషన్కు చేరుకోగానే రైలు బి3 కోచ్లో పొగలు కనిపించాయి. బ్రేక్ ప్యాడ్లు రాపిడి, బ్రేక్లు అసంపూర్తిగా విడుదల చేయడం వల్ల మంటలు అంటుకున్నాయి. మంటలు బ్రేక్ ప్యాడ్లకే పరిమితమయ్యాయి. ఎలాంటి నష్టం జరగలేదు'' అని ప్రకటనలో పేర్కొంది. గంటలోపే సమస్యను సరిదిద్దామని, రాత్రి 11 గంటలకు రైలు స్టేషన్ నుంచి బయలుదేరిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఇది ప్రయాణికులలో భయాందోళనలను సృష్టించింది. వారిలో ఎక్కువ మంది రైలు నుండి బయటకు పరుగులు తీశారు. బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ రైలు ప్రమాదంలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, 1,100 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్లో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు విషాదం జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది.
దుర్గ్-పూరి ఎక్స్ప్రెస్ ఎయిర్ కండిషన్డ్ కోచ్లో మంటలు
June 09, 2023
0
Tags