తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామానికి సంవత్సరానికి కోటి రూపాయలు !

Telugu Lo Computer
0


ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే తెలంగాణలోని ప్రతి గ్రామానికి సంవత్సరానికి కోటి రూపాయలు ఇస్తానని, ప్రతి సర్పంచ్ కు 20వేల రూపాయల జీతం ఇస్తానని చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించానని తెలిపారు. పార్టీలోకి వస్తే రెండు జిల్లాల్లో గెలిపించే బాధ్యత తనదని చెప్పానని, ఆయన ఆలోచిస్తానని చెప్పాడని తెలిపారు. నిన్న జరిగిన రైలు ప్రమాదానికి మోడీ కారణం కాదా అని అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు అన్ని చారిటీలు ఆపేశారని, వారి మీద కేసులు వేశాను, నోటీసులు పంపించానని తెలిపారు. కుటుంబ పాలన, కుల పాలన, డబ్బు పాలన వలన అర్హులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)