ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా ఉత్కంఠ విజయం

Telugu Lo Computer
0


ఇంగ్లాండ్  లోని బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరిగిన యాషెస్ సిరీస్‌లోని మొదటి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టు ఇచ్చిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసింది. అందుకు తగ్గట్టుగా జో రూట్ (118) అజేయ సెంచరీతో మెరిశాడు. అలాగే తొలి రోజు ఇంగ్లండ్ 8 వికెట్లకు 393 పరుగులు చేసి డిక్లేర్ చేసి ఆశ్చర్యపరిచింది. దీంతో వెంటనే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా తొలి ఇన్నింగ్స్‌లో మెరిశాడు. జాగ్రత్తగా బ్యాటింగ్ ప్రదర్శించిన ఖ్వాజా 141 పరుగులు చేశాడు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 141 పరుగులు చేయగా, 2వ ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేశాడు. మొత్తం 206 పరుగులు చేసిన ఖ్వాజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Post a Comment

0Comments

Post a Comment (0)