పోలీసుల కస్టడీకి సాయికృష్ణ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ అప్సర మర్డర్ కేసులో నిందితుడైన సాయికృష్ణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దీనితో నేడు, రేపు ఈ హత్యకు సంబంధించి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయనున్నారు. హత్య జరిగిన ప్రాంతం అలాగే డెడ్ బాడీని పడేసిన మ్యాన్ హోల్ వద్ద రెండు చోట్ల సీన్ రీ కన్ స్ట్రక్షన్ ను చేయనున్నారు. కాగా ఈ కేసులో హతకుడైన సాయిని 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. దీనితో శంషాబాద్ పోలీసులు సాయిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆలయంలో పూజారిగా ఉన్న సాయికృష్ణకు సరూర్ నగర్ కు చెందిన అప్సర అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త శారీరక సంబంధంగా మారింది. అయితే అప్పటికే పెళ్లి అయిన సాయిక్రిష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ తనను పెళ్లి చేసుకోవాలని అప్సరా సాయికృష్ణపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీనితో ఆమె అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమెను ఈనెల 3న కారులో తీసుకెళ్లి పథకం ప్రకారం తలపై దుడ్డు కర్రతో బాది చంపేశాడు. ఆ తరువాత అప్సర డెడ్ బాడీని మ్యాన్ హోల్ లో పడేశాడు. ఆ తరువాత దుర్వాసన రాకుండా ఒక బస్తా ఉప్పును అందులో పోశాడు. అంతేకాదు ఓ ట్రక్కు ఎర్రమట్టిని పరిచయం ఉన్న వ్యక్తులతో పోయించాడు. మరుసటి రోజు మ్యాన్ హోల్ దగ్గరకు వెళ్లిన సాయికృష్ణ దుర్వాసన రావడంతో సిమెంట్ తో ఆ మ్యాన్ హోల్ ను మూసివేశాడు. కానీ సీసీ ఫుటేజిలో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అవ్వడంతో అసలు విషయం బయటకొచ్చింది. అలాగే అప్సరకు గతంలోనే కార్తీక్ రాజాతో పెళ్లి జరిగిందని తేలడంతో ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అయితే పెళ్లి తరువాత కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి అప్సర అత్త, కార్తిక్ రాజా అమ్మ ధనలక్ష్మీ సంచలన ఆడియోను బయటపెట్టింది. చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న కార్తీక్ రాజాను అప్సర గతంలో ప్రేమ వివాహం చేసుకుందని, అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో ధనలక్ష్మీ సంచలన ఆరోపణలు చేసింది. తన కొడుకు కార్తీక్ రాజాను అప్సర వేధించిందని, ఆ వేధింపులు తట్టుకోలేకే కార్తీక్ సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించింది. పెళ్లి జరిగిన కొద్దిరోజులకే అప్సర ఆమె తల్లి తన కొడుకును తీవ్రంగా వేధించారని ఓ ఆడియోలో ధనలక్ష్మీ పేర్కొంది. అంతేకాదు తన కొడుకును జైల్లో కూడా పెట్టించారని, ఆ అవమానాన్ని తట్టుకోలేకే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. కార్తీక్ తో అప్సర, ఆమె తల్లి అరుణ తరచూ గొడవలు పడేవారని ధనలక్ష్మీ ఆడియోలో స్పష్టం చేసింది. కార్తీక్ ఆత్మహత్య చేసుకోడానికి అప్సర, ఆమె తల్లే కారణమని ఆమె ఆరోపించింది. కార్తీక్ రాజా సూసైడ్ తరువాత అప్సర ఆమె తల్లితో కలిసి వెళ్లిపోయిందని, కానీ ఎక్కడికి వెళ్లిపోయిందో తెలీదన్నారు. ఇప్పుడు అప్సర హత్య విషయం తెలిశాక వారు హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలిసిందని ధనలక్ష్మీ పేర్కొన్నారు. అప్సరకు సినిమాల్లో నటించాలనే కోరిక బాగా ఉండేదని అందుకోసమే వాళ్లు హైదరాబాద్ వెళ్లుంటారని అనుకుంటున్నట్టు తెలిపారు. అయితే కార్తీక్ రాజా ఆత్మహత్య తరువాత అప్సర ఆమె తల్లి హైదరాబాద్ సరూర్ నగర్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో పూజారి సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని అప్సర సాయికృష్ణపై ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ అప్పటికే పెళ్లి జరిగిన సాయికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దీనితో తీవ్ర ఒత్తిడికి గురైన సాయి పథకం ప్రకారం అప్సరను కారులో తీసుకెళ్లి హత్య చేశాడు. ఆ తరువాత దానిని కప్పిపుచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా అసలు నిజాలు బయటకొచ్చాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)