సైన్ బోర్డుపై పుష్-అప్‌లు చేసిన వ్యక్తి వీడియో వైరల్ !

Telugu Lo Computer
0


ఒడిశాలోని సంబల్ పూర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఫుల్‌గా మద్యం తాగిన వ్యక్తి సైన్ బోర్డుపై పుష్-అప్‌లు చేశాడు. దారిన వెళ్లే వాహన దారులు ఈ ఘటన చూసి షాకయ్యారు. అతనికి ప్రాణాలకు ప్రమాదం సంభవించవచ్చని ఆందోళన పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు ఆ వ్యక్తి పరారయ్యాడు. sambalpuri_mahani._andpatnagarh_top_models అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 'ఆర్మీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడా?' అని కొందరు.. 'అతను తాగాడని అందరూ అనుకుంటున్నారు.. కానీ అతను పాపులర్ అవ్వడానికి ఈ ఫీట్ చేస్తున్నాడు' అని కొందరు కామెంట్లు పెట్టారు. ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన మందుబాబులు తప్పతాగి రోడ్లపై పడిపోయిన దృశ్యాలు కనిపిస్తూనే ఉంటున్నాయి. లేదంటే ఇలాంటి విపరీతమైన పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఫీట్లు చేసే మందుబాబులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)