కొవిన్‌ పోర్టల్‌ పూర్తి సురక్షితం !

Telugu Lo Computer
0


కొవిన్‌ పోర్టర్‌లోని డేటా లీక్‌ అయ్యిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న తరుణంలో డేటా లీక్‌ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. ఆరోగ్య శాఖకు చెందిన కొవిన్‌ పోర్టల్‌ పూర్తిగా సురక్షితమని స్పష్టం చేసింది. ఆ పోర్టల్‌లోని సమాచారం గోప్యంగా ఉందని వెల్లడించింది. ఈ క్రమంలనే డేటా లీక్‌ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ఈ సందర్బంగా కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.  ఎలాంటి ఆధారం లేకుండానే లీకైనట్లు ప్రచారం జరిగిందని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని సీఈఆర్‌టీని కేంద్రం కోరింది. ఇదే సమయంలో కొవిన్ పోర్టల్‌ పూర్తిగా సేఫ్‌. ఇందులోని డేటాను సీక్రెట్‌గా ఉంచేందుకు వెబ్‌ అప్లికేషన్‌ ఫైర్‌వాల్‌, యాంటీ-డీడీఓఎస్‌, ఐడెంటిటీ అండ్‌ యాక్సెస్‌ మేనేజ్‌మెంట్‌ ఇలా అన్ని భద్రతా ప్రమాణాలతో పోర్టల్‌ను రూపొందించినట్టు స్పష్టం చేసింది. ఓటీపీ అథెంటికేషన్‌తో మాత్రమే కొవిన్‌ పోర్టల్‌లోని డేటాను చూడగలమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఓటీపీ లేకుండా కొవిన్‌ పోర్టల్‌లోని సమాచారాన్ని ఏ బాట్‌లోనూ షేర్‌ చేయలేమని కేంద్రం పేర్కొంది. డేటా లీక్‌ వార్తలపై తాము దర్యాప్తు చేపటినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌ను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌లో భారతీయులు టీకా తీసుకున్నారు. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్‌ వివరాలు, ఫోన్‌ నంబర్‌తో పాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్‌ వేసుకున్నారు వంటి సమాచారం ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)