ఒకే కాన్పులో ఐదుగురు ఆడ బిడ్డల జననం

Telugu Lo Computer
0


ఝార్ఖండ్ లోని రాంచీ రిమ్స్‌ ఆసుపత్రిలో ఓ మహిళ ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. శిశువులు తక్కువ బరువుతో పుట్టడంతో ఎన్‌ఐసీయూలో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. తల్లీ బిడ్డలు క్షేమంగానే ఉన్నారని డాక్టర్లు  తెలిపారు.  ఈ ఘటన గురించి డాక్టర్లు ట్వీట్టర్‌లో వెల్లడించారు. ''ఛాటర్‌కు చెందిన ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. శిశువులను ఎన్‌ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నాం'' అని రిమ్స్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఛత్రా జిల్లాలోని ఇత్ఖోరీ లో నివసిస్తున్న మహిళకు అనేక ఇతర సమస్యలు ఉండటంతో గర్భం దాల్చలేదు. దీంతో ఆమె పలు చికిత్సలు తీసుకున్న తరువాత ఎట్టకేలకు గర్బం దాల్చింది. ఆమెకున్న ఆరోగ్య సమస్యల వల్ల ఏడు నెలలకే ప్రసవం జరిగింది. ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆమె ఐదుగురు ఆడపిల్లలు పుట్టటంతో డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)