నటుడు శరత్బాబును కడసారి చూసేందుకు చెన్నైలోని ఆయన నివాసానికి సినీ తారలు తరలి వస్తున్నారు. రజనీకాంత్, సుహాసిని, రాధిక, శరత్కుమార్, సూర్య, రాంగోపాల్ వర్మ ఇలా పలువురు తారలు శరత్బాబు పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో రజనీకాంత్ మాట్లాడుతూ శరత్బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ''శరత్బాబుతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. నటుడు కాకముందు నుంచే ఆయన నాకు తెలుసు. ఆయన చాలా మంచి వారు. ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపించేవారు. ఆయన ముఖంలో నాకు కోపం కనిపించలేదు. అద్భుతమైన పాత్రల్లో నటించాడు. మేమిద్దరం కలిసి పలు చిత్రాల్లో నటించాం. ఆయనకు నేను అంటే ఎంతో ఇష్టం. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించేవాడు. గతంలో ఓ సందర్భంలో నేను సిగరెట్ కాల్చడం చూసి, మానేయమంటూ నన్ను మందలించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా'' అని రజనీకాంత్ తెలిపారు. అంత్యక్రియలకు సంబంధించిన పనులన్నింటినీ నటి సుహాసిని పర్యవేక్షిస్తున్నారు.
సిగరెట్ తాగొద్దని మందలించాడు
May 23, 2023
0
Tags