తీహార్ జైల్లో టిల్లు తాజ్ పురియా హత్య

Telugu Lo Computer
0


ఢిల్లీలోని తీహార్ జైల్లో జరిగిన గ్యాంగ్ వార్ లో రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడిగా ఉన్న టిల్లు తాజ్ పురియాను ప్రత్యర్థి యోగేష్ తుండా ముఠా కొట్టి చంపారు. యోగేష్ అతని అనుచరులు టిల్లు తాజ్ పురియాపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తీవ్ర గాయాలైన తాజ్ పురియాను జైలు సిబ్బంది హుటాహుటిన ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే టిల్లు చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. తీహార్ జైల్లో హత్యకు గురి అయిన టిల్లు 2021లో రోహిణి కోర్టు షూటౌట్ కేసులో తాజ్‌పురియా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తీహార్ జైల్లో హై సెక్యూరిటీ వార్డులోని గ్రౌండ్ ప్లోర్ లో ఉన్న టిల్లు హత్యకు గురికావటం గమనించాల్సిన విషయం. పక్కా ప్లాన్ ప్రకారమే టిల్లు హత్య జరిగినట్లుగా తెలుస్తోంది ఈ దాడి జరిగిన తీరు. మంగళవారం (మే2,2023) ఉదయం హై సెక్యూరిటీ వార్డులోని గ్రౌండ్ ప్లోర్ ఉన్న టిల్లు గదిలోకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే యోగేశ్ ముఠా బెడ్ షీట్ల సహాయంతో దూకారు. చేతిలో ఇనుపరాడ్లు పట్టుకుని టిల్లు తాజ్ పురియా అలియాస్ సునీల్ మాన్ ఉంటున్న గది గ్రిల్ ను తొలగించి కొట్టి చంపారు. టిల్లును కొట్టి చంపిన గ్యాంగ్ లో యోగేష్ తో పాటు దీపక్, రాజేష్,రియాజ్ ఖాన్ లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కాగా 2021 సెప్టెంబర్ 24న గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగిని కోర్టు భవవనంలోనే టిల్లు గ్యాంగ్ కాల్చి చంపింది. న్యాయవాదుల దుస్తుల్లో కోర్టు భవనంలోకి వచ్చిన టిల్లు గ్యాంగ్ కాల్పులు జరిపి జితేందర్ గోగిని హత్య చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)