సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఐదుగురి మృతి

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటనలో మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషాద ఘటన ముంబయికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో జరిగింది. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. గురువారం మధ్యాహ్నం ఆరుగురు కూలీలు ఓ పొలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ ను క్లీన్ చేసేందుకు అందులోకి దిగారు. ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక అస్వస్థతకు గురై మరణించినట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)