జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విషయంల ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించా లని నిర్ణయం తీసుకున్నది. అన్ని పంచాయతీల్లో శనివారం మధ్యాహ్నం 12.00 గంటలకల్లా విధులకు హాజరుకాని పంచాయతీ సెక్రటరీల వివరాలను కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు సేకరించాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. విధులకు హాజరుకాని జేపీఎస్లు ఇక ఎంతమాత్రం ప్రభుత్వ ఉద్యోగులు కారని నొక్కిచెప్పారు. వారి టర్మ్ ముగిసినట్లుగానే ప్రభుత్వం భావిస్తున్నట్లు కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు (లోకల్ బాడీస్), జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసర్ల (డీపీఓ)తో కొత్త సచివాలయం నుంచి శుక్రవారం సాయంత్రం సీఎస్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. సీఎస్ పై క్లారిటీ ఇచ్చారు. విధులకు హాజరుకాని జేపీఎస్లకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదనే స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ నెల 8న స్పష్టమైన నోటీసు ఇచ్చి 9వ తేదీ సాయంత్రం 5.00 గంటలకల్లా విధుల్లో చేరాల్సిందిగా డెడ్లైన్ పెట్టిందని, లేదంటే వారిని టెర్మినేట్ చేస్తామని హెచ్చరించిందని సీఎస్ గుర్తుచేశారు. విధులకు హాజరుకాని జేపీఎస్లతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేనప్పుడు ఇక వారిని టెర్మినేట్ చేయాల్సిన అవసరమూ ఉండదని ఆమె స్పష్టం చేశారు. గైర్హాజరైన పంచాయతీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు, డీపీవోలకు ఆమె నొక్కిచెప్పారు. విధులకు హాజరుకాని పంచాయతీల్లో స్థానికంగా పట్టభద్రులై ఉండి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన యువతను గుర్తించి తాత్కాలిక పద్ధతిలో పంచాయతీ సెక్రటరీలుగా రిక్రూట్ చేయాలని ఆదేశించారు. మధ్యాహ్నం 12.00 గంటల వరకు విధులకు హాజరుకాని పంచాయతీ సెక్రటరీల జాబితాను కలెక్టర్లు, డీపీవోలు ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు.
Post Top Ad
adg
Friday, 12 May 2023
Home
telangana
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వ కఠిన నిర్ణయం !
ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
శనివారం మధ్యాహ్నం 12.00 గంటలకల్లా విధులకు హాజరుకావాలి
సీఎస్ వీడియో కాన్ఫరెన్సు
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వ కఠిన నిర్ణయం !
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వ కఠిన నిర్ణయం !
Tags
# telangana
# జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వ కఠిన నిర్ణయం !
# ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
# శనివారం మధ్యాహ్నం 12.00 గంటలకల్లా విధులకు హాజరుకావాలి
# సీఎస్ వీడియో కాన్ఫరెన్సు
About Telugu Lo Computer
సీఎస్ వీడియో కాన్ఫరెన్సు
Tags
telangana,
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వ కఠిన నిర్ణయం !,
ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,
శనివారం మధ్యాహ్నం 12.00 గంటలకల్లా విధులకు హాజరుకావాలి,
సీఎస్ వీడియో కాన్ఫరెన్సు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment