తెలంగాణలోని నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన గడ్డదాల ముత్తన్నపిబ్రవరి 20న గుండెపోటుతో మరణించాడు. చిన్నప్పటి నుండి దీపిక (17) తాత వద్దనే గారాబంతో పెరిగింది. దీపిక తాతయ్య మరణాన్ని జీర్ణించుకులేక ప్రతిరోజూ బాధపడుతూ కృంగిపోయేదని, ఆదివారం ఉదయం 11 గంటలకు ఎప్పటిలాగే కాలకృత్యాలకు వెళ్లి వస్తానని తల్లి కమలకు చెప్పి వెళ్లింది. చాలాసేపటి వరకు కూతురు తిరిగి ఇంటికి రాకపోయేసరికి అనుమానంతో వెతకగా మృతురాలు దీపిక చెప్పులు ఇంటికి సమీపాన గల చెరువు కట్టపై కనిపించాయని చెరవులో చూడగా మృతురాలు నీటిలో తేలియాడుతూ కనిపించింది. తనను అపురూపంగా పెంచిన తాత చనిపోయాడని తిరిగిరాడన్న బెంగతో జీవితంపై విరక్తి చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చిన్న ముత్తన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు మృతదేహాన్ని పంచానామ చేసి పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
తాత మరణం తట్టుకోలేక మనవరాలి ఆత్మహత్య
April 03, 2023
0
Tags