కాంగ్రెస్‌ నాయకులు ఒక సర్కస్‌ కంపెనీ లాంటి వారు !

Telugu Lo Computer
0


కర్నాటకలోని గంగావతి నగరంలో బీజేపీ అభ్యర్థి పరన్న మునువళ్లి గెలుపు కోసం మంత్రి శ్రీరాములు శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు ఒక సర్కస్‌ కంపెనీ లాంటి వారని, ఎవరు ఎప్పుడు ఏమి మాట్లాడతారో తెలియదని, రాష్ట్రంలో ఈ సారి కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని, 140 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ఒక చెడిపోయిన బస్సు లాంటిది. ఈ సారి 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల తరువాత పాత బస్సును ఏవిధంగా తుక్కుకి వేస్తారో అలాగే కాంగ్రెస్‏ను కూడా తుక్కుకి వేయక తప్పదన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను సాగనం పేందుకు సి ద్ధంగా ఉన్నారన్నారు. గంగావతిలో ఎమ్మెల్యే పరన్న మునువళ్లి ఎంతో అభివృద్ధి చేశారని, మరోసారి ఆయన్ని గెలిపించి అభిమానాన్ని చాటుకోవాలన్నారు. బీజేపీని వీడిన నాయకులతో ఎటువంటి నష్టం లేదని, ప్రజలు బీజేపీకి అండగా ఉండారన్నారు. బీజేపీని చీల్చాలన్న కాంగ్రెస్‌కు యుక్తులు పని చేయవన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరన్న మునువళ్లి, విరుపాక్షప్ప సింగనాళ్‌, అమరజ్యోతి వెంకటేష్‌, వీరభద్రప్ప నాయక్‌, హనుమంతప్ప నాయక్‌, జోగద నారాయణప్ప నాయక్‌, చెన్నప్ప మళిగి, సంతోష్‌ కల్లోజి, కాశీనాథ్‌ చిత్రగార్‌, కప్పగల్లు ప్రభు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)